క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.నంద్యాలలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “రాజు మనస్తత్వం బాగుంటేనే వర్షాలు వస్తాయి. ప్రస్తుతం రాజు తీరు సరిగ్గా లేదు, అందుకే ప్రకృతి కూడా సహకరించడం లేదు,” అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మాయ మాటలతో, అబద్ధపు హామీలతో మోసం చేశారని ఆరోపించారు. “ఆశ పెట్టి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట. ప్రజల ఆశ ముందు కృతజ్ఞత ఓడిపోయింది,” అని బుగ్గన వ్యాఖ్యానించారు.మరోవైపు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఆయన ప్రశంసించారు. “జగన్ మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనులను చూసి ఓట్లు అడిగారు తప్ప, అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టలేదు,” అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి కూడా మంచి పాలకులకు సహకరిస్తుందని, ప్రస్తుతం ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు.బుగ్గన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
భారత్ ఘోర ఓటమి.. కోచ్ గంభీర్ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్!
రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశాలు: 4,098 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు