Homeవైరల్వరంగల్‌లో చిరుత కలకలం.. సీసీ కెమెరా దృష్యాలు వైరల్!

వరంగల్‌లో చిరుత కలకలం.. సీసీ కెమెరా దృష్యాలు వైరల్!

వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామ పరిసర ప్రాంతాల్లోని ఓ రైస్‌మిల్లులో అమర్చిన సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నమోదవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో సమీపంలోని పామాయిల్ తోటల్లో చిరుత అడుగుల ముద్రలు కనిపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. చిరుత సంచారం నిజమా కాదా అన్న దానిపై స్పష్టతకు రావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రాథమికంగా చూస్తే చిరుత ఆ ప్రాంతంలో తిరిగిన అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రత్యేకంగా పశువుల కోసం గ్రామాల వద్దకు చిరుత వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా ఉండాలని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచనలు జారీ చేశారు.

ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. చిరుత కదలికలపై నిఘా పెంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో రాగంపేట గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

also read: మహారాష్ట్ర టెట్‌ పై కీలక నిర్ణయం! హిజాబ్ అనుమతికి ఒకే కానీ… ఇలా చేయక తప్పదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు