క్రైమ్ మిర్రర్, నల్లగొండ బ్యూరో: డాక్టర్ సుంకరి రాజారామ్, డాక్టర్ చేగోని రవికుమార్ సంయుక్తంగా రచించిన “ICT APPLICATIONS IN ACADEMIC LIBRARIES OF TELANGANA” అనే నూతన గ్రంథాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది.
విద్యారంగంలో సమాచార సాంకేతికత వినియోగం ఎంతో కీలకం
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యారంగంలో సమాచార సాంకేతికత వినియోగం ఎంతో కీలకమన్నారు. తెలంగాణలోని అకడమిక్ లైబ్రరీల అభివృద్ధికి ఈ పుస్తకం దోహదపడుతుందని అన్నారు. డిజిటల్ యుగంలో లైబ్రరీలు ఆధునీకరణకు ఇది మార్గదర్శిగా ఉంటుందన్నారు.
రచయితలు ఏం చెప్పారంటే?
రచయితలు డాక్టర్ సుంకరి రాజారామ్ ( ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ ), డాక్టర్ చేగోని రవికుమార్ మాట్లాడుతూ, తెలంగాణలోని అకడమిక్ లైబ్రరీల్లో ఐసీటీ వినియోగం, సవాళ్లు, అవకాశాలను ఈ పుస్తకంలో వివరంగా చర్చించామని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, లైబ్రేరియన్లకు ఇది ఉపయోగపడే సూచనా గ్రంథంగా రూపొందించినట్లు వివరించారు. శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహచార్యులు ఈ పుస్తకాన్ని రచించిన డాక్టర్ సుంకరి రాజారామ్, డాక్టర్ చేగోని రవికుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యారంగ ప్రముఖులు, లైబ్రేరియన్లు, పరిశోధకులు పాల్గొన్నారు.