.
జనగామ, క్రైమ్ మిర్రర్:బచ్చన్నపేటలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన జనగామ జిల్లాలో సంచలనం సృష్టించింది.
బచ్చన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి ఇటీవల వార్డు మెంబర్గా ఎన్నికయ్యాడు. అదే గ్రామానికి చెందిన దంపతులకు రూ.20 లక్షల అప్పు ఇచ్చాడు ప్రశాంత్ రెడ్డి. అయితే అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో వారి కూతురినిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. అవసరమైతే ఎదురుకట్నం ఇస్తానని ఆశ చూపి కొంత డబ్బు ముట్టజెప్పాడు.