Homeక్రైమ్ఇబ్ర‌హీం ప‌ట్నంలో దారుణం....బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం...!

ఇబ్ర‌హీం ప‌ట్నంలో దారుణం….బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: బీటెక్ చ‌దువుతున్న తోటి విద్యార్థికి మ‌ద్యం తాగించి హ‌త్యా చారం చేసిన ఘ‌ట‌న ఇబ్ర‌హీంప‌ట్నం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడుతల విజయ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్.. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

మే 14వ తేదీన తనతోపాటు చదువుతున్న యువతిని టీ తాగుదామని ఆహ్వానించాడు. ఇద్దరు కారులో దిల్‌సుఖ్‌‌నగర్‌కు వెళ్లారు. టీ తాగిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉడుతల విజయ్ మద్యం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బీడీఎస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి కారులో ఆ యువతిని తీసుకెళ్లాడు. విద్యార్థినితో అతడు మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఉడుతల ఉదయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు