Homeక్రైమ్సిఎం బందోబస్తు: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. రాసిన సూసైడ్ నోట్..!

సిఎం బందోబస్తు: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. రాసిన సూసైడ్ నోట్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత (33) అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఈ విషాదకర సంఘటన జరిగింది. సంగీత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మట్టెవాడలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అంతకుముందు రోజు (ఏప్రిల్ 20) ముఖ్యమంత్రి బందోబస్తు విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. సంగీత రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. అందులో తోటి కానిస్టేబుల్ శ్రీధర్ వేధింపులే తన మరణానికి కారణమని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు