Homeతెలంగాణనేడు మేడిగడ్డ పై రేవంత్ రెడ్డి పర్యట...!

నేడు మేడిగడ్డ పై రేవంత్ రెడ్డి పర్యట…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేడు (ఏప్రిల్ 20, 2026) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ముఖ్యంగా బ్లాక్ నంబర్ 7లోని కుంగిన 19, 20, 21 పిల్లర్లను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలిసి బ్యారేజీ పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహిస్తారు.

బ్యారేజీ పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుమారు ₹200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తారు. కాటారం మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఈ వేదిక నుంచే రైతు భరోసా పథకం రెండో విడత నిధులను (సుమారు ₹2,063 కోట్లు) లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. రాబోయే సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లపై కూడా సంబంధిత అధికారులతో ఆయన చర్చించనున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు