HomeతెలంగాణBreaking: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా...!

Breaking: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 2026 మే నెలలో ఎన్నికలు నిర్వహించే దిశగా సన్నాహాలు చేస్తోంది. జూలై 10, 2025 నుండి ఫిబ్రవరి 5, 2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసిన జాబితా ఆధారంగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశించింది. ఓటర్ల వివరాల్లో ఏవైనా లోపాలుంటే ఈ నెల ఏప్రిల్ 23, 2026 లోపు నివేదించాలని కలెక్టర్లకు సూచించింది.

అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్తుల పదవీకాలం గత ఏడాది జూలైలోనే ముగిసింది. అప్పటి నుండి ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇప్పటికే ఫిబ్రవరి 2026లో ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ముగిసిన వెంటనే, మే నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు