Homeక్రైమ్దేవుడికి పూజ చేస్తూ అనంతలోకాలకు...!

దేవుడికి పూజ చేస్తూ అనంతలోకాలకు…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని బేగంపేటలో గురువారం పూజ చేస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 62 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి దుర్మరణం చెందారు. విజయలక్ష్మి తన ఇంట్లో నిత్య పూజలో భాగంగా దీపం వెలిగిస్తుండగా, ఆమె చీరకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. మంటలు అంటుకోవడంతో ఆమె భయాందోళనకు గురై బెడ్‌రూమ్‌లోకి పరిగెత్తారు.

ఆ క్రమంలో మంటలు అక్కడి దుప్పటికి వ్యాపించి ఉధృతమయ్యాయి. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పదవీ విరమణ తర్వాత ఒంటరిగా నివసిస్తున్నారు. అదే భవనంలోని పై అంతస్తులో ఆమె కుమార్తె ఉంటున్నారు. స్థానికులు ఇళ్లలోంచి పొగలు రావడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు