క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- ఐపీఎల్ సీజన్-19 లో భాగంగా ఇప్పటికే జరిగిన అన్ని మ్యాచులు ప్రేక్షకులకు అన్ని విధాలుగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మార్చి 28వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ ఐపీఎల్ 19 సీజన్ పై ప్రతి ఒక్కరు కూడా పలు రకాలుగా బలాలు మరియు బలహీనతలు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని కోట్లు పెట్టి కొన్నటువంటి ఆటగాళ్లు ఈ ఐపీఎల్ లో తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. ఈ జాబితాలో ముఖ్యంగా లక్నో జట్టు భారీ హీట్టర్ నికోలస్ పూరన్ మొట్టమొదట వరుసలో ఉన్నాడు. ఫ్రాంఛైజీ అతడిని ఏకంగా 21 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకోగా ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ లోను దానికి తగ్గ న్యాయం చేయలేకపోయాడు. ఇక నిన్న జరిగినటువంటి బెంగళూరు తో మ్యాచ్లో ఏడు బంతులకు గాను కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అవ్వడం పట్ల ఫ్యాన్స్ అందరూ తీవ్ర ఆసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో కలిపి కనీసం 50 కి పైగా పరుగులు చేయలేకపోయారు. దీంతో అతని స్థానంలో మరొక ప్లేయర్ని తీసుకోవాలి అంటూ జట్టు యాజమాన్యానికి ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. మరోవైపు కోల్కత్తా జుట్టులోని ఫారన్ ప్లేయర్ గ్రీన్ కూడా జట్టుకు భారంగా మారారు.
వెల్లుల్లి ద్వారా ఎన్ని లాభాలో మీకు తెలుసా?
తెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా పర్యాటక అభివృద్ధి: మంత్రి జూపల్లి కృష్ణారావు
