క్రైమ్ మిర్రర్, గూడురు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలోని ఓ పాఠశాల నుంచి పదవీ విరమణ పొందబోతున్న ఉపాధ్యాయుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఇంచార్జ ఎంఈవో రవికుమార్, ఆయనకు అసిస్టెంట్ గా పనిచేస్తున్న అయోధ్యపురం హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి ఏసీబీకి పట్టుబడ్డారు. వారు స్వయంగా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ బుధవారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
ఏసీబీ వలలో ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్..!
0
57
