Homeతెలంగాణగుడ్ న్యూస్: ఇలా మరణిస్తే 8 లక్షల పరిహారం లభిస్తుంది..!

గుడ్ న్యూస్: ఇలా మరణిస్తే 8 లక్షల పరిహారం లభిస్తుంది..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: విద్యుత్ షాక్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా (పరిహారం) మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరియు విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) ఇటీవల భారీగా పెంచాయి. సాధారణ పౌరులు విద్యుత్ షాక్‌తో మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంచుతూ  ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పెంచిన పరిహారం ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చింది. వినియోగదారుల పొరపాటు వల్ల ప్రమాదం జరిగినప్పటికీ ఈ పరిహారం వర్తిస్తుంది.

ప్రమాదం జరిగిన రెండు నెలల లోపు డిస్కంలు ఈ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే అందుకు గల కారణాలను వివరించాలని ఈఆర్‌సీ ఆదేశించింది. విధి నిర్వహణలో మరణించిన విద్యుత్ శాఖ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. గతంలో (2019 నుండి 2024 వరకు) ఈ పరిహారం రూ. 5 లక్షలుగా ఉండేది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ. 1 లక్ష మాత్రమే ఉండేది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments