-
జర్నలిస్ట్ సూర్యవంశం పరుశరాముడు
పెబ్బేరు ,క్రైమ్ మిర్రర్: పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీశ్రీ మిట్ట ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కొరకు ఆదివారం జర్నలిస్ట్ సూర్యవంశం పరుశరాముడు, ధర్మపత్ని జయమ్మ, కుమారుడు సూర్యవంశం భాను ప్రకాష్ కూతురు సంధ్య, కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులకు రూ. 10,116 రూపాయలు అందజేశారు.
జర్నలిస్టు సూర్యవంశం పరుశరాముడు మాట్లాడుతూ ఆంజనేయస్వామి మా ఇంటి దేవుడు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని మా ఇంటి సభ్యులు అందరమూ కొలుస్తామని ఆయన అన్నారు. ఆలయ అభివృద్ధికి ముందుండి పనిచేస్తానని అభివృద్ధిలో భాగంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గౌని బుచ్చారెడ్డి. ఆధ్వర్యంలో సూర్యవంశం పరుశరాముడు ను శాలువతో ఘనంగా సన్మానించారు ఆలయ అర్చకులు. గురురాజాచార్యులు. నవీన్. వేదమంత్రాలతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో. హనుమంత్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి.సాయి రెడ్డి.సంబు కృష్ణయ్య. పురుషోత్తం రెడ్డి. వేణు. వెంకటేశ్వర్ రెడ్డి. కోటేష్ తదితరులు పాల్గొన్నారు
