జగిత్యాల జిల్లా,క్రైమ్ మిర్రర్:-గొల్లపల్లి,మండలంలోని దట్నూరు గ్రామంలో నెలకొన్న పారిశుధ్య లోపం, వీధి దీపాల సమస్యపై ‘క్రైమ్ మిర్రర్’ ప్రతినిధి చేసిన విజ్ఞప్తికి అధికారులు సానుకూలంగా స్పందించారు.దట్నూరు గ్రామ ప్రధాన రహదారి పక్కన వీధి స్తంభాలకు లైట్లు లేక చీకటి అలుముకోవడం, పిచ్చి మొక్కలు పెరిగిపోయి పారిశుధ్యం అధ్వానంగా మారడంపై స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ‘క్రైమ్ మిర్రర్’ గమనించి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను వివరించడమే కాకుండా, ప్రజల ఇబ్బందులను వారికి వివరించారు.సెక్రెటరీ గారి సానుకూల స్పందన:రిపోర్టర్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన పంచాయతీ సెక్రెటరీ, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు, పిచ్చి మొక్కలను కొట్టించి పారిశుధ్యం మెరుగుపరిచారు. అంతేకాకుండా, వెలగని వీధి దీపాలకు కొత్త లైట్లు వేయించి గ్రామంలో వెలుగులు నింపారు.తమ సమస్యను గుర్తించి అధికారులతో మాట్లాడి పరిష్కరింపజేసిన ‘క్రైమ్ మిర్రర్’ ప్రతినిధికి మరియు వెంటనే స్పందించి పనులు చేయించిన పంచాయతీ సెక్రెటరీ గారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
