Homeతెలంగాణ1988-89 సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

1988-89 సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ 50 వసంతాల వయసు దాటడంతో ఆదివారం మండల కేంద్రంలో 50 వసంతాల ఆత్మీయ కలయికతో పాటు, ఆత్మీయ సమ్మేళనాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాల్య మిత్రులందరు ఒకచోట కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ,పూర్వ విద్యార్థులందరూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆటపాటలతో, సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న లోడి భాస్కర్ గౌడ్, మొరిపిరాల గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా ఎన్నికైన యాస జనార్దన్ రెడ్డిని ఈ సందర్భంగా బాల్య మిత్రులు ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థులందరికీ జ్ఞాపికలను అందజేశారు.

పదేళ్లు పాలించి పదుల సార్లు ఇదిగో అదిగో అన్నారు : మండల కాంగ్రెస్ పార్టీ

Russian Oil Imports: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఉన్నట్టా? లేనట్టా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments