Homeతెలంగాణఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో కార్యాలయ స్థలంపై వివాదం

ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో కార్యాలయ స్థలంపై వివాదం

మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో కార్యాలయ స్థలాన్ని కేటాయించే అంశంపై రెండు ప్రభుత్వ శాఖల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎన్ఎస్పీ క్వార్టర్స్‌ను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

 

అయితే, అదే ప్రాంగణంలో ఇప్పటికే డివిజన్ కార్యాలయం కొనసాగుతుండటంతో క్వార్టర్స్‌ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇవ్వలేమని ఎన్ఎస్పీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఖాళీ చేయాలని కోరుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా “క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలి” అంటూ సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, “ఇచ్చే ప్రసక్తే లేదు” అంటూ ఎన్ఎస్పీ సిబ్బంది పరస్పరం వాగ్వివాదానికి దిగారు.

 

కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఈ వ్యవహారంపై జిల్లా అధికారుల స్పష్టత రాకపోవడంతో సమస్య ఇంకా పరిష్కారం కాని స్థితిలోనే ఉంది. రెండు శాఖల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ఎలా ముగుస్తుందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు