Homeక్రైమ్కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు...!

కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు…!

క్రైమ్ మిర్రర్, సోషల్ డెస్క్ : రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా గంగాపూర్ సిటీలో మానవత్వాన్ని తాకట్టు పెట్టిన దారుణ ఘటన వెలుగుచూసింది. 65 ఏళ్ల వృద్ధురాలు కమలా దేవిని వెండి కడియాల కోసం ఇద్దరు దుండగులు కాళ్లు నరికి వదిలేశారు. ఈ ఘటన రాజస్థాన్ అంతటా సంచలనం సృష్టించింది. సమాచారం ప్రకారం, కమలా దేవి తన కుమార్తెను కలవడానికి గంగాపూర్ సిటీలోకి వచ్చింది. అక్కడ రామోతర్ అలియాస్ కాడు బైర్వా (32) అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచి, మీను కుమార్తె ఇంటికి తీసుకెళ్తాను అంటూ వాహనంలో ఎక్కించాడు. అతని భార్య తాను అలియాస్ సోనియా కూడా అతనితో కలిసి ఉంది. మార్గమధ్యంలో ఇతర ప్రయాణికులను దింపి, వృద్ధురాలిని బైపాస్ ప్రాంతంలో తన ఇంటికి తీసుకెళ్లాడు.

సాయంత్రం సమయంలో ఆమెకు భోజనం పేరుతో పరాటా, రొట్టెలు ఇచ్చాడు. వాటిని తిన్న అనంతరం కమలా దేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో నిందిత దంపతులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, కాళ్లు నరికేసి వెండి కడియాలు దోచుకుని అక్కడే వదిలి వెళ్లిపోయారు. తెల్లవారుజామున కొందరు స్థానికులు ఆ వృద్ధురాలిని రక్తపు మడుగులో పడి ఉండగా చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను గంగాపూర్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడి నుండి జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ (SMS) హాస్పిటల్‌కు మార్చి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా విచారణ జరిపి, రామోతర్ మరియు అతని భార్య సోనియాను అరెస్ట్ చేశారు. విచారణలో, వీరు ఇంతకుముందు కూడా ఇలాంటి దారుణ ఘటనల్లో పాల్పడినట్లు తెలిసింది. ఒంటరిగా ప్రయాణించే మహిళలను నమ్మించి, వారిని మత్తుపదార్థాలు ఇచ్చి మోసం చేయడం, ఆ తర్వాత ఆభరణాలు దోచుకోవడం వీరి పద్ధతి అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్న ఆభరణాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికిన ఈ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు చదవండి …

  1.  ఏసీబీ వలలో రెవిన్యూ తిమింగలం..! లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో

  2. యాదాద్రి భువనగిరిలో దారుణం..! హోంగార్డుపైకి దూసుకెళ్లిన లారీ

  3. మైనర్ బాలిక హత్య కేసు – దూకుడు పెంచిన డీఎస్పీ శివరాం రెడ్డి

  4. నల్లగొండ వైద్యుల నిర్లక్ష్యం.! – గర్భిణి గర్భంలోనే పసికందు మృతి

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు