Tuesday, March 10, 2026
Homeతెలంగాణ80 ఏళ్ల చరిత్ర కలిగిన శంకరమఠం కూరగాయల మార్కెట్ ను జెసిబి లతో కూలగొట్టిన ...

80 ఏళ్ల చరిత్ర కలిగిన శంకరమఠం కూరగాయల మార్కెట్ ను జెసిబి లతో కూలగొట్టిన అధికారులు!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని అంబర్ పేట నగరంలో ఉన్నటువంటి శంకర మఠం కూరగాయల మార్కెట్ ను ఇవాళ ఉదయం అధికారులు జెసిబి లతో పడగొట్టారు. శంకర మఠం కూరగాయల మార్కెట్ రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారంటూ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూరగాయల దుకాణాల్ని జెసిబి లతో తొలగించారు. కాగా ఈ శంకర మఠం కూరగాయల మార్కెట్ కు దాదాపుగా 80 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా బ్రతుకులను రోడ్డుపాలు చేసిందని తాజాగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

రంజీల్లో కోహ్లీ ఒక్కరోజు జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!..

కాగా మరోవైపు నానక్ రాంగూడ ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపుతో మా బతుకులు రోడ్డున పడ్డాయి అంటూ సుమారుగా ఒక వంద మంది వీరి వ్యాపారాలు స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో డీసీ ముకుంద రెడ్డిని కలిశారు. తక్షణమే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఓ గదిలో తల్లి మృతదేహం, మరో గదిలో ఇద్దరు కూతుళ్లు.. 9 రోజులు శవంతోనే..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments