మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో గల రెండు పడక గదుల ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు గూడు కనిపించే ఉద్దేశంతో చేపట్టిన రెండు పడక గదుల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.