హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఆసియాలోనే నవంబర్ వన్ ధనవంతుడిగా గౌతమ్ అదాని నిలిచారు. కాగా గత ఏడాది కాలంగా అదాని గ్రూప్ ఎన్నోసవాళ్లను ఎదుర్కొని మళ్లీ గౌత్ అదాని బబ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా విడుదల చేయగా అందులో ఇండియా నుంచి ఇద్దరు నిలిచారు.
గౌతమ్ అదాని, ముకేష్ అంబానీలు కాగా మళ్లీ ఈసారి కూడ గౌతమ్ అదాని సంపదలో ముఖేష్ అంబానీని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నారు.అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల (అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ) షేర్లు గత కొన్ని నెలలుగా అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ముఖ్యంగా సుప్రీం కోర్టు హిండెన్బర్గ్ వ్యవహారంలో ఇచ్చిన క్లీన్ చిట్ తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది.
అబుదాబికి చెందిన IHC వంటి అంతర్జాతీయ సంస్థల నుండి భారీగా పెట్టుబడులు రావడం, అదానీ గ్రూప్ తన అప్పులను గణనీయంగా తగ్గించుకోవడం ఆయన సంపద పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధనానికి (Green Energy) డిమాండ్ పెరగడం, ఈ రంగంలో అదానీ గ్రూప్ చేపట్టిన భారీ ప్రాజెక్టులు కంపెనీ విలువను పెంచాయి.
అదాని సంపద…
ప్రస్తుత లెక్కల ప్రకారం గౌతమ్ అదానీ ( 92.6 బిలియన్ డాలర్లు), ముఖేష్ అంబానీ ( 90.8 బిలియన్ డాలర్లు). 2023 ప్రారంభంలో హిండెన్బర్గ్ నివేదిక వల్ల అదానీ సంపద భారీగా పడిపోయినప్పటికీ, కేవలం ఒక ఏడాది కాలంలోనే ఆయన మళ్లీ పుంజుకోవడం వ్యాపార రంగంలో ఒక సంచలనంగా మారింది.
