-
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ డిపో వద్ద ఉద్రిక్తత
-
ప్రైవేట్ హైర్ బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికుల జేఏసీ
-
పోలీసులకు కార్మికులకు వాగ్వాదం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపో వద్ద నేడు (ఏప్రిల్ 22, 2026) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కార్మికులు డిపో ముందు భారీ నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ (JAC) ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు.
డిపో నుంచి ప్రైవేట్ హైర్ బస్సులను బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నించగా, కార్మికులు వాటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దిల్సుఖ్నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.