Homeతెలంగాణవాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై భూమేష్.. ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్

వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై భూమేష్.. ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్

రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:- రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి అండర్‌బ్రిడ్జి వద్ద ఎస్సై భూమేష్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలులేని 4 ద్విచక్ర వాహనాలు, 1 కార్ ను పోలీసులు సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహన పరిమితులకు మించి అతివేగంగా వెళ్లడం ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని ఎస్సై తెలిపారు.

Read also : కనుమరుగు కానున్న కరెంట్ తీగలు.. ఇక మీ ఇంటికి వైర్‌లెస్ విద్యుత్!

Read also : ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు