HomeజాతీయంRajnath Singh: బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ముక్కలే, రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Rajnath Singh: బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ముక్కలే, రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Rajnath Singh Warns Pakistan: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోల్‌కతాపై దాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఊహించలేమని హెచ్చరించారు.

రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందిస్తూ, పాకిస్థాన్ నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. గత చరిత్రను గుర్తు చేస్తూ, 1971లో పాకిస్థాన్ రెండు ముక్కలైన సందర్భాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఎదుర్కొన్న పరిణామాలను గుర్తుంచుకోవాలని పాక్ నాయకులకు ఆయన సూచించారు. భారతదేశం తన భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఎలాంటి బెదిరింపులనైనా తట్టుకునే సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు.

ఇక పాకిస్థాన్ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ రాజకీయాల్లో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, కోల్‌కతాను బహిరంగంగా బెదిరించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కనీసం ఈ వ్యాఖ్యలను ఖండించే ధైర్యం కూడా చూపలేదని ఆయన విమర్శించారు.

ఈ సంఘటనతో భారత్-పాక్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ఉధృతమైంది. రాజకీయంగా కూడా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బలమైన హెచ్చరికలు జారీ చేస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలు దీనిపై స్పందన లేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు