Homeతెలంగాణఈ-పంచాయతీ యూనియన్ నల్లగొండ జిల్లా కొత్త భాద్యతలు

ఈ-పంచాయతీ యూనియన్ నల్లగొండ జిల్లా కొత్త భాద్యతలు

ఉపాధ్యక్షుడిగా కలకొండ శివకృష్ణ ఎంపిక

త్రిపురారం క్రైమ్ మిర్రర్, అక్టోబర్ 27: నల్లగొండ జిల్లా ఈ-పంచాయతీ ఉమ్మడి ఆపరేటర్స్ యూనియన్‌ కొత్త భాద్యతలను ఎంపిక చేసింది. నల్లగొండ కేంద్రంలో జరిగిన సమావేశంలో యూనియన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను ఎన్నుకున్నారు.

కనగల్ మండలానికి చెందిన కందుల వెంకన్న అధ్యక్షుడిగా, త్రిపురారం మండల ఈ-పంచాయతీ ఆపరేటర్ కలకొండ శివకృష్ణ ఉపాధ్యక్షుడిగా, అలాగే తండు లింగస్వామి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read:రేవంత్ కు షాక్.. నవంబరు 3 నుంచి అన్ని కాలేజీలు బంద్

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ఖాసీం, ఉమ్మడి ఈ-పంచాయతీ వింగ్ డీ.పీ.యం. బాణాల గంగాధర్ తదితరులు ఎన్నికైన నాయకులను అభినందించి సన్మానించారు.కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల ఈ-పంచాయతీ ఆపరేటర్లు, పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read:సీఎం రేవంత్ కు మరో మంత్రి ఝలక్.. తలపట్టుకున్న హైకమాండ్

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు