Homeతెలంగాణసూర్యాపేట - వనపర్తి ప్రాంతాల మీదుగా కొత్త రైల్వే లైన్ పూర్తి..!

సూర్యాపేట – వనపర్తి ప్రాంతాల మీదుగా కొత్త రైల్వే లైన్ పూర్తి..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మార్చి 25, 2026న లోక్‌సభలో ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో డోర్నకల్ – గద్వాల మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కొత్త రైల్వే లైన్ సుమారు 296 కిలోమీటర్ల మేర నిర్మించబడుతుంది.

ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాల మీదుగా సాగుతుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ తర్వాత, తెలంగాణ ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక శాఖల సంప్రదింపుల అనంతరం తుది అనుమతులు మంజూరు చేస్తారు. దీంతో పాటు జడ్చర్ల – నంద్యాల మధ్య 182 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మాణం కోసం కూడా సర్వే పూర్తయిందని మంత్రి తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు