Homeతెలంగాణకల్వకుంట్ల కవిత: కొత్త పార్టీ 'సర్వోదయ తెలంగాణ' సాధనే లక్ష్యంగా..!

కల్వకుంట్ల కవిత: కొత్త పార్టీ ‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌లో పర్యటించిన ఆమె, మార్పు కోరుకునే అభ్యుదయవాదులంతా తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

అయితే 2026 ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీ పేరు మరియు జెండాను ఆవిష్కరించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ ఫంక్షన్ హాల్ (అధ్వయ కన్వెన్షన్) వద్ద భారీ బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు.

‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా, నీళ్లు, నిధులు, నియామకాల వంటి ఆశయాల కోసం పోరాడేందుకు ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పార్టీలో మహిళలు, యువతకు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని కవిత పేర్కొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు