హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: అంతర్జాతీయ ఉద్రిక్తల కారణాల నేపథ్యంలో ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలపడడం మొదలైన కారణాలతో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు దారులకు శుభవార్తనే అని చెప్పవచ్చు.
Also Read:చర్చలు విఫలమైతే ఇక అంతే.. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు స్ర్టాంగ్ వార్నింగ్
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,070గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,33,890గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,220గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,34,040గా ఉంది.
Also Read:పవన్ మార్క్ పోలీసింగ్.. హోంశాఖపై వ్యాఖ్యలు వెనుక మర్మం అదేనా.!