ఉత్తర్ప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రతిభావంతుడైన ఒక యువకుడు, ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సమాజాన్ని కలచివేస్తోంది.
23 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు బీటెక్లో అద్భుత ప్రతిభ కనబరిచి 2024లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. చదువులో అగ్రగామిగా నిలిచిన అతను భవిష్యత్తులో మంచి స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అయితే, వరుసగా ఎన్నో పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల బిహార్కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ ఘటన తర్వాత పోలీసులు సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన తండ్రికి క్షమాపణలు చెబుతూ, “సుమారు 50 సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాను. కానీ విజయవంతం కాలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న” అని భావోద్వేగంగా రాసినట్లు తెలిసింది.
ఆనంద్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా, ఈ ఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, ఉద్యోగ అవకాశాల కొరత వంటి అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
also read: ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తుండగా విషాదం: ఇద్దరు కళాకారులు మృతి, కుటుంబాలకు టీటీడీ అండ