Homeతెలంగాణఫర్టిలైజర్ షాప్ లో అర్ధరాత్రి దొంగతనం

ఫర్టిలైజర్ షాప్ లో అర్ధరాత్రి దొంగతనం

పెబ్బేరు,క్రైమ్ మిర్రర్ :- పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని మహేష్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. షటర్ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. కాష్ కౌంటర్ లో ఉన్న రూ.5 వేలు నగదు దొంగతనం చేసినట్లు యజమాని నీలం శంకర్ తెలిపారు. దొంగతనం చేసి అక్కడే ఉన్న కుండలో నీళ్లు తాగి, మూత్ర విసర్జన చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. షాప్ యజమాని నీలం శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Read also : చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. సెమీఫైనల్స్ లో అద్భుత విజయం

Read also : పెళ్లి పీటలు ఎక్కనున్న భారత స్టార్ మహిళా క్రికెటర్.. వరుడు ఇతడే?

Read also : అయ్యప్ప స్వాములు అలర్ట్.. శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు