మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. విడుదలైన రెండు వారాలు పూర్తయి, మూడో వారంలోకి అడుగుపెట్టినా వసూళ్ల జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ను అధిగమించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో అయ్యప్ప స్వామిని పోలిన గెటప్లో పులిపై కూర్చున్న చిన్నారి కనిపించగా.. ఆమె పక్కన రవితేజ, ప్రియా భవానీ శంకర్ దర్శనమిచ్చారు. ఈ విజువల్ సినిమాలో కనిపించనిది కావడంతో అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. పోస్టర్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇక ‘ఇరుముడి’ మూడో వారంలోనూ బాక్సాఫీస్పై తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఈ వారాంతంలో పెద్దగా చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాబోయే వీకెండ్లోనూ థియేటర్ల వద్ద ‘ఇరుముడి’ హవా కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.200 కోట్ల మార్క్ను అందుకోవడంతో చిత్ర బృందం, రవితేజ అభిమానులు సంబరాల్లో ఉన్నారు. మున్ముందు ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరుగుతాయా? అనేది చూడాలి.
also read: ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్కు రెడీ.. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!
