Homeతెలంగాణకేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్‌...!కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్‌.. నాది సోషల్‌ జస్టిస్ అంటూ కామెంట్స్‌...

కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్‌…!కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్‌.. నాది సోషల్‌ జస్టిస్ అంటూ కామెంట్స్‌…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులకే కీలక పదవులు దక్కాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 16న పరకాల, ములుగు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్‌…

Also Read:బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి ప్రత్యక్షం.. 11 మందికి అస్వస్థత

పరకాలలో జరిగిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. “కేసీఆర్‌ రాజకీయాలు ఫ్యామిలీ జస్టిస్‌.. మా రాజకీయాలు సోషల్‌ జస్టిస్‌” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీశ్‌రావుకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. తన ప్రభుత్వం మాత్రం సీతక్క, కొండా సురేఖ వంటి నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిందని చెప్పారు.కేసీఆర్‌ తన కుమార్తెకు ఎంపీగా, అనంతరం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము మాత్రం కడియం కావ్యకు ఎంపీగా, యశస్వినికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని తెలిపారు. అలాగే ఉద్యమకారుడు కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని చెప్పారు.

“కేసీఆర్‌ కుటుంబానికే ప్రయోజనం”…

Also Read:టీఎంసీ ఆఫీసులో మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ కలకలం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో కేసీఆర్‌ కుటుంబానికే ఎక్కువ ప్రయోజనం కలిగిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను భారీగా అప్పులపాలు చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రానికి సుమారు రూ.8.11 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చారని, ఆ అప్పులకు వడ్డీ రూపంలో ఏటా దాదాపు రూ.75 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

రైతులు, మహిళలు, యువతపై ఫోకస్‌…

Also Read:అమెరికాలో వరుస కాల్పులు.. ఆరుగురు మృతి

తమ ప్రభుత్వం రైతుల కోసం భారీగా నిధులు ఖర్చు చేసిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ హామీ అమలులో భాగంగా 85 లక్షల మంది రైతులకు తొలి విడతలోనే రూ.8,617 కోట్లు మాఫీ చేశామని చెప్పారు. యువతకు రెండున్నరేళ్లలో సుమారు 70 వేల ఉద్యోగాలు కల్పించామని, భవిష్యత్తులోనూ దశలవారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు