టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి భాగ్యశ్రీ బోర్సేకు మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమె.. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించనున్న భారీ చిత్రంలో హీరోయిన్గా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది.
మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘కాంత’, ‘లెనిన్’ చిత్రాలతో నటిగా మరింత గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఆమె నటనకు మంచి స్పందన రావడంతో టాలీవుడ్లో ఆమెకు అవకాశాలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న నాని కొత్త చిత్రంపై ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్లో నాని సరసన భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే భాగ్యశ్రీ ఎంపికపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఇది సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే చెప్పుకోవాలి. ఒకవేళ ఈ వార్త నిజమై, నాని సరసన నటించే అవకాశం భాగ్యశ్రీకి దక్కితే.. ఆమె కెరీర్లో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
ఇప్పటికే వరుస అవకాశాలతో బిజీ అవుతున్న భాగ్యశ్రీ బోర్సేకు నాని వంటి స్టార్ హీరోతో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ అభిమానులు భావిస్తున్నారు. మరి ‘బ్లడీ రోమియో’ విషయంలో ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
also read: చోడవరంలో దారుణం.. కుటుంబ కలహాలతో భర్త హత్య?
