క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సమాచారాన్ని విడుదల చేసింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:-
విజయనగరం
మన్యం
అల్లూరి
పోలవరం
ఎన్టీఆర్
గుంటూరు
బాపట్ల
పల్నాడు
కర్నూలు
ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని ఎస్డీఎంఏ పేర్కొంది.
గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద టెన్షన్:- మరోవైపు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 13 అడుగుల మేర నీరు ఉండటంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగి నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చాక్లెట్ రోజుకు ఎంత తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా!
కడుపు ఉబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా.. పరగడుపున ఈ నీళ్లు తాగండి!
