ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం ప్రకారం, బైక్ నడుపుతున్న సమయంలో వాహనం అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల కార్తీక్ ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో కలిసి ప్రయాణిస్తున్న మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసి.. కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో గంగవరం ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. యువకుడి మృతి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది.
also read: హిమాచల్ ప్రదేశ్లో అమానుష ఘటన: ఆలయంలో దొంగతనం ఆరోపణలతో మహిళలపై దాడి
