హైదరాబాద్,క్రైమ్మిర్రర్: విద్యా సంస్థల అధినేత, బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి అంతా సిద్దమైంది. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. తెలంగాణకు బదులు.. కర్ణాటక నుంచి బరిలో దిగడం మంచిదని ఆమె ఆలోచిస్తోన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Also Read:కందుకూరు మండలంలో సీలింగ్ భూముల క్రయ- విక్రయాలు..!?
రెండు రాష్ట్రాల సరిహద్దు స్థానంలో ప్రీతిరెడ్డి పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. కాగా 2024 ఎన్నికల్లోనే బీఆర్ ఎస్ పార్టీ నుంచి మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ నాయకత్వం లేకపోవడంతో వెనక్కి తగ్గారు. కాగా మేడ్చల్ నుంచి మల్లా రెడ్డి గెలువగా, మల్కాజీగిరి నుంచి అల్లుడు గెలుపొందాడు. ఇప్పుడు మల్లా రెడ్డి కుటుంబంలో రాజీకయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాగా ఇప్పుడు ప్రీతి రెడ్డి బీజేపీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేసి కర్ణాటక నుంచి పోటీ చేస్తారనే చర్చా సాగుతుంది.
