అమేధీ, క్రైమ్ మిర్రర్: బీజేపీ సినీయర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు ఓటరు జాబితానుంచి మాయమయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేఠీ నుండి 2019లో ఎంపీగా ఎన్నికై, మేదాన్ మావయ్ గ్రామంలో స్మృతి ఇరానీ సొంత ఇల్లు నిర్మించుకుని, అదే పంచాయతీలో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు.
Also Read:జీమ్ లో మహిళా పైలట్ కు వేధింపులు…! కేసు నమోదు….
ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అక్కడి నుండే పోటీ చేసినా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు మాయమయింది. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు అమేఠీ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.