Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రంపై ఇంత కక్ష ఎందుకు..?

తెలంగాణ రాష్ట్రంపై ఇంత కక్ష ఎందుకు..?

  • తెలంగాణ రాష్ట్రంపై ఇంత కక్ష ఎందుకు..?

  • బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుల పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వ్యాపారాలు మొత్తం తెలంగాణ నుండి ఆంధ్రాకు పంపించాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలోని బీసీభవన్ లో బీసీ సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రం పై ఆంధ్ర ప్రాంత నాయకులు పదే పదే విషం చిమ్ముతున్న కూడా వారికి సంబంధించిన వ్యాపార సముదాయాలు మరియు కళాశాల, పాఠశాలలు, సినిమా థియేటర్లు మొత్తం పూర్తిస్థాయిలో ఆంధ్రా ప్రాంతానికి పంపించాలని ఆయన అన్నారు నిత్యం తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్ము తు తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.

సిగ్గు లేకుండా వ్యాపారాలు, ఆస్తులు, పాఠశాల లు కళాశాలలో, ఆసపత్రులు తెలంగాణలో ఏర్పాటు చేసుకొని నిత్యం తెలంగాణ ప్రాంత ప్రజల రక్తం తాగుతున్న ఆంధ్ర ప్రాంత నాయకులకు సంబంధించిన వాటిని తక్షణమే ఆంధ్రాకు తరలించకపోతే మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా ఉద్యమం చేశామో అదే తరహాలో మళ్లీ ఉద్యమం చేసి మీ వ్యాపార సామ్రాజ్యాలపై దాడులు చేసే పరిస్థితి ఉంటుందని ఆయన హెచ్చరించారు..

తెలంగాణ నాయకులు సిగ్గు లేకుండా ఆంధ్రాలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు లో తెలంగాణకు సంబంధించిన వాళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచినట్టుగా. మాట్లాడిన వ్యక్తులను తెలంగాణలో అడుగుపెట్టనివ్వద్దు అని ఆయన అన్నారు ఎన్నో త్యాగా లు పోరాటాలతో వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చీడ పురుగుల వల్ల అమర వీరుల త్యాగ ఫలితం వృధా అవుతుందని ఆయన అన్నారు.

ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంపై నిత్యం కొంతమంది కుట్రలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మ అభిమానాన్ని దెబ్బ తీస్తున్నారని. ఆయన అన్నారు ఇలాంటి తెలంగాణ వ్యతిరేకుల్ని గుర్తించి ప్రభుత్వం రాష్ట్రం ప్రయోజనాల దృష్ట్యా వారిని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ జేఏసీ కన్వీనర్ దాసరాజు జయరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి రవీందర్ గౌడ్, ప్రణయ్, రాము తదితరులు పాల్గొన్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు