Homeఆంధ్ర ప్రదేశ్సీఎం రమేష్ వర్సెస్ పురందేశ్వరి...!

సీఎం రమేష్ వర్సెస్ పురందేశ్వరి…!

  • కేంద్రమంత్రి పదవి కోసం గట్టి పోటీ

  • ఇద్దరికీ హై కమాండ్ వద్ద పరపతి

  • అధిష్టానం ఎటు మొగ్గు చూపుతుందో?

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. అందుకే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా మోడీ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. రేపు విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. చేర్పులు మార్పులతో పాటు యువతకు ఈసారి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

ఒకరికి తప్పకుండా..
ఏపీలో బిజెపి ఎంపీ ఒకరికి మంత్రి పదవి ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రమేష్. కడప జిల్లాకు చెందిన ఆయన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం విశేషం. అయితే అప్పట్లోనే సీఎం రమేష్ ను క్యాబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం నడిచింది.

కానీ అనూహ్యంగా నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కు ఛాన్స్ దక్కింది. అయితే ఈసారి వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఆ కోటాలో సీఎం రమేష్ పేరును ప్రముఖంగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. కేంద్ర పెద్దలతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు కలిసి వచ్చే అంశం.

చిన్నమ్మకు గట్టి పోటీ..
మరోవైపు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం రమేష్ కు ఆమె గట్టి పోటీగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బిజెపి నుంచి కేవలం ముగ్గురే గెలిచారు. అందులో నరసాపురం ఎంపీపీ మంత్రిగా అవకాశం దక్కింది. మిగిలింది ఈ ఇద్దరు మాత్రమే. అయితే పురందేశ్వరి సైతం గతంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో కలిసి వచ్చే అంశం.

మొన్నటి ఎన్నికల్లో ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండేవారు. టిడిపి తో పొత్తు వెనుక అటు సీఎం రమేష్.. ఇటు పురందేశ్వరి కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పటికే పురందేశ్వరి సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండడంతో.. ఆమెకు చిన్నపాటి ఇబ్బంది. అయితే వెనుకబడిన తరగతులు వారికి మంత్రి పదవి ఇస్తామనుకుంటే మాత్రం.. కచ్చితంగా సీఎం రమేష్ కు అవకాశం దక్కుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు