హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘ఏందయ్య సామీ..’ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లక్షకు పైగా రీల్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
“రణబాలి”లో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా ఈ అందమైన పాట చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో ‘ఏందయ్య సామీ..’ పాటలో అందంగా రూపొందించారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది.