క్రైమ్ మిర్రర్, త్రిపురారం ప్రతినిధి: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కేంద్రంలో రైతు వేదిక ప్రాంగణంలో త్రిపురారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. మాటూరు సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్ అధ్యక్షతన మాటూరు గ్రామానికి చెందిన వాంకుడోతు శ్రావణి, వాంకుడోతు స్వాతి, వాంకుడోతు రేణుక, ధానావత్ స్వాతి, ధానావత్ అంజలి, వాంకుడోతు ఝాన్సీ లకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, నిడమానూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాటూరు సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్, మండల ఆర్.ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు.