HomeజాతీయంNarendra Modi: ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు, ట్రంప్‌పై దాడి ఖండించిన మోదీ!

Narendra Modi: ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు, ట్రంప్‌పై దాడి ఖండించిన మోదీ!

World Reacts to Trump Attack: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాల నాయకులు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించారు. ట్రంప్‌ సురక్షితంగా బయటపడటం సంతోషంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అటు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ దాడిని ఖండించారు. ఇది కేవలం ట్రంప్‌పై, అమెరికాపై జరిగిన దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలని అన్నారు. అలాగే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

బ్రిటన్‌ ప్రధాని కిర్ స్టార్మర్ ఈ కాల్పుల ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్, కెనడా ప్రధాని మార్క్ కెర్నీ, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, జపాన్‌ ప్రధాని స్నె ట్కిచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బెన్స్ కూడా ఈ దాడిని ఖండిస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ప్రపంచ దేశాల నాయకులు ఒక్కసారిగా స్పందించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరాన్ని మరింతగా స్పష్టంచేశారు. హింసకు వ్యతిరేకంగా గళమెత్తడం మాత్రమే కాదు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా పిలుపునిచ్చారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు