క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఇది ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే వార్త. ప్రభుత్వం మరియు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) జేఏసీ మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో కార్మికులు తమ సమ్మెను విరమించారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి.
కార్మికులు కోరిన ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్ల కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. గత కొన్ని రోజులుగా రవాణా పరంగా ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలకు, విద్యార్థులకు ఇప్పుడు మార్గం సుగమమైంది..