అమరావతి, క్రైమ్ మిర్రర్ః రాష్ర్టంలో ఇందన కొరత, పలుచోట్ల పెట్రోల్ బంక్లు మూసివేత అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు అదికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో సీఎం మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.