క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో త్వరలోనే జన గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మే నెల లో ఈ జనగణన ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని తాజాగా అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ వరకు, తెలంగాణ రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఉంటుంది. మరోవైపు సెల్ఫ్ యెన్యూమరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 16 నుంచి 30 తేదీలలో, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 26 నుంచి మే 10 తేదీ మధ్య జరుగుతుంది అని వెల్లడించారు. ఈ సెల్ఫ్ యెన్యూమరేషన్ లో ప్రజలు తమ ఇళ్ల సమాచారాన్ని సెన్సెస్ వెబ్సైట్లో నమోదు చేయొచ్చు అని తెలిపారు. ఈ జనగణన ప్రక్రియలో భాగంగా ఇళ్ల సర్వేలలో దాదాపు 34 ప్రశ్నలు అడుగుతారు. దీంతో ఈ జనగణన ప్రక్రియపై ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాయి.
అలర్ట్..!ఓవైపు పిడుగులు, మరోవైపు వడగాలులు?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు వీర జవాన్ తల్లిదండ్రుల విజ్ఞప్తి!
