•ఓటర్ జాబితా మ్యాపింగ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
యాదాద్రి జిల్లా,క్రైమ్ మిర్రర్:- యాదగిరిగుట్ట మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఎస్ఐఆర్ లో భాగంగా ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ… పోలింగ్ కేంద్రం నెం.145 ఇందిరా కాలనీ, యాదగిరిగుట్ట నందు ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ మ్యాపింగ్ పనులును పరిశీలించారు. ఓటర్ల వివరాలు ఖచ్చితంగా నమోదు కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అధికారులకు సూచించారు.ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక ఎస్ఐఆర్ సక్రమంగా రూపొందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మ్యాపింగ్ త్వరగతిన పూర్తి చెయ్యలని అదేశించారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ గణేష్ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నిద్రపోతున్నప్పుడు జుట్టు ఊడిపోతే ఇలా చేయండి
బంపర్ ఆఫర్!.. ఈ 4 రాశుల వారికి తలరాత మారబోయే టైం వచ్చేసింది..
