Homeతెలంగాణఎండుతున్న పంటపొలాలు... దివాలు చెందుతున్నా రైతన్నలు

ఎండుతున్న పంటపొలాలు… దివాలు చెందుతున్నా రైతన్నలు

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం) మండలం, పల్లెర్ల గ్రామంలో కరెంట్ లేక ఎండిపోతున్న పంట పొలాలను చూస్తూ కన్నీరు పెడుతున్న రైతులు. ఈ సందర్భంగా రైతు సామ నరేందర్ రెడ్డి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ… సమయానికి కరెంట్ లేక నాలుగు ఎకరాల పంట పొలం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంట్ కష్టాలతో రైతన్నలకు చాలా ఇబ్బంది అవుతోంది అని ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని కోరారు. జెనరేటర్లు పెట్టి నడిపించిన గాని పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఎండా కాలం వచ్చిందని కరెంట్ కోత ఇట్లాగే ఉంటే ఎండిపోయిన పొలాలను చూసుకుంటూ ఏడుపు తప్ప రైతన్నలకి మరొకటి లేదని అన్నారు.

రైతన్నలు రాజులు అయితారో కారో తెలియదు గాని అప్పుల బాధతో చావుకు మాత్రం దగ్గర అవుతున్నారని అన్నారు. ఎండిపోయిన పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు