నంద్యాల, క్రైమ్ మిర్రర్: ఆళ్లగడ్డ శివారు లోని పి వి ఎస్ ఆర్ గోడౌన్ లొ వైయస్ఆర్సీపీ నేత శివరామిరెడ్డి పై టీడీపీ దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కత్తులతో దాడిచెయ్యడంతో శివరామిరెడ్డి శరీరంపై బలమైన గాయాలయ్యాయి.
తనపై అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ దాడి చేసాడని నన్ను చంపడానికి ప్రయత్నించారని బాధితుడు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియ తన భర్త డబ్బుల కోసమే ఈ దాడి చేయించారని విమర్శించారు. శివరామిరెడ్డిని అత్యవసర చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
