Homeరాజకీయంనేటికీ అందని రైతు భరోసా, పంట రుణమాఫీ..!

నేటికీ అందని రైతు భరోసా, పంట రుణమాఫీ..!

  • బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులు నేటికి అందకపోవడంతో రైతాంగం తీవ్ర ఆవేదనతో ఉన్నారని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన బీసీ యువజన సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

పంట పెట్టుబడికి ముందుగా అందించాల్సినటువంటి రైతు భరోసా నిధులు పంట కోత దశకు వచ్చిన కూడా ప్రభుత్వం నేటికీ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేయకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ రైతులతో చెలగాటం ఆడుతుంది మండిపడ్డారు.

పెట్టుబడి సాయంగా కింద ప్రభుత్వం నేటి వరకు అందకపోవడంతో రైతులు అప్పులు చేస్తున్న సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది అన్నారు. రైతులను చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వంకి రైతులు త్వరలోనే మంచి గుణపాఠం చెప్తారని అన్నారు.

ఒకవైపు రైతు భరోసా నిధులు అందకపోవడం మరోవైపు పంటకు కావాల్సిన ఎరువులు అందించక పోవడంతో రైతాంగం ప్రభుత్వంపై తీవ్ర వెతిరేకంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఆలాగే రైతులకు పంట రుణమాఫీ చేశాం అని చుప్పుకుంటున్నరు తప్ప, ఇప్పటి వరకు కూడా పంట రుణమాఫీ 20 వేల వరకు కూడా మాఫీ కాలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం మా ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేసింది అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులను అడిగితే తెలుస్తుంది ఎంతవరకు పంట రుణమాఫీ జరిగిందో అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, రాజేందర్, అనంతయ్య, సతీష్, రవీందర్, సావిత్రి, నిర్మల తదితరులు పాల్గొన్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు