•నిలబడే ఓపిక లేక నేలపై పడుకున్న వృద్ధులు
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్ :-
శంషాబాద్ జోన్ పరిధి రావిర్యాలలో వృద్ధాప్య పింఛన్ల కోసం ఉదయం 7 గంటల నుండి బుక్కులను లైన్లో పెట్టి కూర్చున్నారు. మధ్యానం 1 అయిన పింఛన్లు ఇవ్వడానికి అధికారి రాకపోవడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు.కొంత మంది వృద్ధులు కూర్చునే ఓపిక లేక పోస్ట్ ఆఫీస్ ముందు పడుకున్నారు. ప్రతినెల ఒక రోజు ,రెండురోజులు కొంతమందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి మరుసటి రోజు ఆలస్యంగా వస్తున్నాడని వృద్ధులు, వికలాంగులు,ఒంటరి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెల పింఛన్లు త్వరగా పంపిణీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
కెఎల్ఆర్ నివాసానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

