Homeక్రైమ్కెసి తండా చెరువులో ఇద్దరు చిన్నారులు మృతి

కెసి తండా చెరువులో ఇద్దరు చిన్నారులు మృతి

మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): ప్రమాదవశాత్తు చెరువులోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో చోటు చేసుకుంది.

పోలీసుల అంచనా ప్రకారం..సరదాగా ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లిన కేసీ తండాకు చెందిన జటావత్ రిషి(6), జటావత్ బద్రీనాథ్(8) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలో ఆడు కునేందుకు మధ్యాహ్న సమయంలో ఇంటినుంచి వెళ్లారు.

రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంభ సభ్యులు మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆడుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలో ఉన్న కొత్వాల్ చెరువులో పడిపోయారని అనుమానంతో చెరువులో పోలీసులు, రిస్క్యు టీం సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు ఆదివారం రాత్రి నుండి చేపట్టగా కొన్ని గంటల తర్వాత సోమవారం ఉదయం జటావత్ రిషి(6), జటావత్ బద్రీనాథ్(8) మృతదేహాలను వెలికితీశారు.

పోస్టు మార్టూమ్ నిమిత్తం ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు